గ్యాస్ సిలిండర్ పేలి 9 మంది మృతి

Mamatha Reddy
గుజరాత్ అహ్మదాబాద్ నగర శివారులో ఒక గదిలో ఎల్పిజి సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ జరగడంతో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో నలుగురు చిన్నారులు మరియు మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు ఈ సంఘటన జులై 20వ తేదీన రాత్రి సమయం లో జరిగింది. ఈ సంఘటన లో గత రెండు రోజులుగా చికిత్స పొందుతూ ఎనిమిది మంది చనిపోగా ఈ రోజు ఒకరు కన్ను మూసారు . వీరంతా మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. 


ఎల్పిజి సిలిండర్ గ్యాస్ లీకేజీ జరగడంతో ఈ దుర్ఘటన అయినట్టుగా భావిస్తున్నారు. ఈ సంఘటనలో పిల్లలతో సహా 10 మంది మహిళలు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా మిగతావారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అని అస్లాలీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పిఆర్ జడేజా తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: