కెసిఆర్ కు అభ్యర్థి ఎక్కడ...?

ఈటల రాజేందర్ ఆరో రోజు హుజరాబాద్ లో పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు బండి సంజయ్ కూడా ఈటెలతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... ఈటల గెలుపు ఖాయమని మెజార్టీ కోసమే ప్రయత్నిస్తున్నామని అన్నారు. అధికారపార్టీకి అభ్యర్థి లేడు అని వ్యాఖ్యానిచారు. దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకం తీసుకువచ్చామని బరితెగించి మాట్లాడుతున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హుజరాబాద్ యువత సపోర్ట్ తమకుందని బండి సంజయ్ అన్నారు. తాను ఎన్నికల్లో గెలుస్తానని ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని ఈటెల రాజేందర్ కేసీఆర్ కు సవాల్ విసిరారు. రాజన్న కమలం పార్టీకి వచ్చాడని..తన  గుర్తు ప్రజలందరికీ తెలిసిపోయిందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో చైతన్యవంతమైన గడ్డ  హుజరాబాద్ అని...హుజురాబాద్ ప్రజలు ప్రలోభాలకు లోబడరు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: