జమ్మూ కాశ్మీర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం.. జవాన్ వీరమరణం.. !

జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాలకు మరియు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టు పెట్టింది. ఉత్తర కాశ్మీర్ లోని బంది పురా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో సైన్యం ఉగ్రవాదులను మట్టుపెట్టింది. అడవుల్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారాన్న సమాచారంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. శుక్రవారం మధ్యాహ్నం అటవీ ప్రాంతానికి చేరుకుని సోదాలు నిర్వహించాయి.

ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. కాగా కాల్పుల్లో సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. ఇప్పటికీ జమ్మూకాశ్మీర్ లో ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. మరోవైపు మాన్ కోటి జిల్లాలోని కృష్ణగాటి సెక్టార్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద మందు పాతర పేలడంతో జావాన్ అమరుడయ్యాడు.  సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో మందు పాతర పై కాలు వేయడంతో అది ఒక్కసారిగా పేలి జవాన్ అక్కడికక్కడే మరణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: