ముడతలు, మచ్చలు పోయి ముఖం తెల్లగా మారే టిప్స్..
ఒక చెంచా పసుపు ఇంకా అలాగే రెండు చెంచాల గంధం పొడి తీసుకొని వాటిని కొన్ని పాలలో కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఇక ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట పాటూ అలా వదిలేయాలి.ఇక ఆ తరువాత గోరు వెచ్చటి నీళ్లతో ముఖాన్ని బాగా కడిగితే మీకు తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై ఉన్న నల్లమచ్చలు చాలా ఈజీగా తొలిగిపోవడం ఖాయం.
ఇక ఎక్కువగా బయట తిరగడం వల్ల కూడా ముఖం ట్యాన్ అవ్వడం అనేది సర్వసాధారణం. ఇక దీని కోసం రసాయనాలతో కూడిన ట్యాన్ రిమూవర్ ను వాడాల్సిన పని అసలు లేదు. పసుపు మీ ముఖానికి సహజసిద్ధమైన ట్యాన్ రిమూవర్ లాగా పనిచేస్తుంది. పసుపు, గులాబీ పొడి ఇంకా పెసర పిండి అలాగే రోజ్ వాటర్ తీసుకొని వాటిని బాగా కలిపి ముఖానికి బాగా మర్ధనా చేయాలి.ఇలా ప్రతి రోజూ రాత్రిళ్లు ఇలా చేసుకుని, కడిగేసుకుని నిద్రపోతే తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది.
ఇక పసుపు ఇంకా బొప్పాయి గుజ్జును కలిపి పేస్టులా చేసుకుని మీ ముఖానికి అలాగే మీ మెడకు మాస్క్ లా వేసుకోవాలి.ఇక ఓ అరగంట తరువాత ముఖాన్ని కడిగేసుకుంటే మీ చర్మం ఎంతో మృదువుగా మారుతుంది.ఇక ఇలా మీరు తరచుగా చేస్తుంటే మీ ముఖంపై ముడతలు అనేవి చాలా కనుమరుగవుతాయి.ఇక అంతేకాదు మీ చర్మం కొత్త మెరుపును కూడా సంతరించుకోవడం ఖాయం.అందువల్ల మీరు చాలా అందంగా కనిపిస్తారు