ఈ న్యాచురల్ టిప్స్ తో అందమే అందం..

Purushottham Vinay
చాలా మంది ముఖాన్ని అందంగా మార్చుకునేందుకు రకరకాల క్రీములు వాడుతూ వుంటారు. అయితే వాటి వల్ల కేవలం తాత్కాలికంగా ఉపయోగం ఉంటుంది కానీ శాశ్వతంగా మాత్రం ఉండదు. అందుకే ఈ న్యాచురల్ టిప్స్ ని పాటించండి. ముఖాన్ని అందంగా ఉంచుకోండి.

ఒక చెంచా గ్రామ్ పిండి తీసుకొని అందులో కొద్దిగా పాలు ఇంకా కొద్దిగా చక్కెర కలిపి బాగా పేస్ట్ లాగా చేసుకోండి. దీన్ని ముఖంతో పాటు మెడపై కూడా బాగా అప్లై చేసి ఒక 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ చేతులతో ముఖాన్ని బాగా మసాజ్ చేసి,కాసేవు తరువాత ముఖాన్ని శుభ్రంగా వట్టి నీళ్లతో కడగాలి.మీకు అవసరానికి అనుగుణంగా పాల పరిమాణాన్ని కూడా ఈ పేస్ట్ తయారిలో పెంచవచ్చు. ఇక ఇందులో చక్కెర అనేది చక్కని స్క్రబ్‌గా పనిచేస్తుంది.. అలాగే ఇది చనిపోయిన చర్మాన్ని కూడా వెంటనే తొలగిస్తుంది...

ఇక అలాగే ఒక అర కప్పు దానిమ్మ గింజలు తీసుకోండి. అలాగే ఒక దోసకాయ రసం కూడా తీయండి. ఆ రసాన్ని ప్రత్యేక కంటైనర్లలో స్టోర్ చేయండి లేదా వాడినప్పుడు ఆ రెండింటినీ బాగా కలపండి. ఇక ఈ టోనర్‌ను ప్రతిరోజూ కూడా ముఖానికి బాగా అప్లై చేయండి లేదా ముఖానికి స్ప్రే చేయండి. ఇక ఈ టోనర్ డల్ స్కిన్ ని శుభ్రపరిచి ముఖాన్ని రిఫ్రెష్ చేస్తుంది. ఇలా ఒక టోనర్ తయారు చేసుకొని ఫ్రిజ్‌లో ఉంచండి, ఇక దీనిని 2-3 రోజులు పాటు కూడా ఉపయోగించవచ్చు.

అలాగే కొన్ని బొప్పాయి ముక్కలను తీసుకొని వాటిని మిక్సీలో బాగా రుబ్బుకోవాలి. ఇక ఈ పేస్ట్‌ని ముఖం పైన ఇంకా మెడపైన రాయండి. కొంత సమయం తరువాత చల్లటి నీటితో ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోండి. ఈ బొప్పాయి ముఖాన్ని బాగా శుభ్రపరుస్తుంది.. అలాగే ముఖంపై మెరుపు కూడా పెరుగుతుంది.

ఇక రెండు చెంచాల ముడి పాలను తీసుకొని ముఖంపై ఇంకా మెడపై బాగా అప్లై చేసి అలాగే ఉంచండి. కొద్దిసేపటి తర్వాత బాగా పొడిబారిన తర్వాత తేలికగా మసాజ్ చేసి,కాటన్ తో తుడవండి. ఒక 15 నిమిషాల తర్వాత తేలికపాటి ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఇందులో వుండే పాలు చర్మాన్ని ఎంతో ప్రకాశవంతం చేస్తాయి.

ఇక అర టీస్పూన్ తేనెను ముఖంపై ఇంకా మెడకు బాగా అప్లై చేసి కొంతసేపు బాగా మసాజ్ చేయండి. తర్వాత ముఖాన్ని కడిగి మాయిశ్చరైజర్ ని రాయండి. అప్పుడు చర్మం కూడా చాలా మృదువుగా ఉంటుంది..అలాగే శుభ్రంగా కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: