ఆధార్: ఇలా చెయ్యొద్దు.. ప్రజలకు కేంద్రం హెచ్చరిక?

Purushottham Vinay
ఇక దేశంలో ప్రతీ పౌరుడుకి కూడా ఆధార్ ఎంతో కీలకంగా మారింది. ప్రభుత్వ పథకాలు మొదలు.. ఏ పని కావాలన్నా అన్నింటికీ ఆధార్ కార్డ్ తప్పనిసరి.ఇక బ్యాంకు ఖాతా మొదలు, రేషన్ కార్డు, ఇలా ప్రతీ అంశం ఆధార్ కార్డుతో లింక్ చేయబడి ఉంది. ఆధార్‌ కార్డు నెంబర్‌లో వ్యక్తి సమగ్ర సమాచారం అనేది నిక్షిప్తమై ఉంది. అయితే, దీన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. ఆధార్ కార్డును వారు దుర్వినియోగపరుస్తున్నారు. దాని నెంబర్ ఆధారంగా అమాయక ప్రజల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కూడా కాజేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ కేసులు చాలా అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు కీలక సూచనలు కూడా జారీ చేసింది. అలర్ట్‌గా ఉండాలంటూ కూడా హెచ్చరించింది.ఏ కారణం చేతనైనా కూడా వినియోగదారులు వారి ఆధార్ ఓటీపీ(OTP)ని ఇంకా వ్యక్తిగత వివరాలను ఇతరులకు వెల్లడించొద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇంకా తెలియని వ్యక్తులతో మీ ఆధార్ కార్డు వివరాలను పంచుకోవద్దని స్పష్టం చేసింది. ఆధార్ కార్డు నుంచి ఓటీపీ చెప్పమని ఎవరూ కాల్ గానీ ఇంకా మెసేజ్ గానీ పంపరని తెలిపింది.


ఒకవేళ మీ ఆధార్ ఈ-కార్డును వేరే కంప్యూటర్ గానీ మొబైల్‌లో గానీ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు ఇక ఆ పని పూర్తయిన తరువాత దానిని డిలీట్ చేయాలి. మీకు ఈ ఆధార్ కార్డ్ కావాలంటే.. అధికారిక uidai పోర్టల్ నుండి మాత్రమే డాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.ఇక మోసగాళ్లు ఆధార్ కార్డును దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఆధార్ కార్డు హోల్డర్స్ తమ కార్డులను కూడా లాక్ చేయొచ్చు. ఇంకా అవసరమైనప్పుడు అన్‌లాక్ చేయొచ్చు. అయితే ఇక ఇది uidai యాప్ ధ్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందులో 16 అంకెల VID నెంబర్‌ను ఉపయోగించి లాక్ చేయడం ఇంకా అన్‌లాక్ చేయడం చేయొచ్చు. మీ మొబైల్ నెంబర్‌ ఇంకా ఇమెయిల్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి. అలా చేయడం వల్ల మీ ఆధార్ దుర్వినియోగం కాకుండా మీరు అడ్డుకోవచ్చు. ఆధార్ విషయంలో ఏదైనా సమస్య కనుక ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1947 కు కాల్ చేయడం ఇంకా help@uidai.gov.inకు ఇమెయిల్ చేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: