ఎయిరిండియా ఫర్ సేల్..!
బిడ్లు దాఖలు చేసిన సంస్థల్లో టాటా సంస్థతో స్పైస్ జెట్ పోటీ పడుతోంది. అయితే ఈ పోటీలో ముందువరుసలో టాటా సంస్థ నిలిస్తే 67 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఎయిరిండియా టాటాల వశం అవుతుంది. 1932లో టాటా గ్రూప్ టాటా ఎయిర్లైన్స్ను నెలకొల్పింది. ప్రస్తుతం టాటాలు సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి విస్తారా ఎయిర్లైన్స్ను నడుపుతున్నారు. మరోవైపు ఎయిర్ ఇండియాకు మొత్తం 43 వేల కోట్ల రూపాయల మేర రుణాలు ఉన్నాయి. వీటిల్లో 22 వేల కోట్ల రూపాయల రుణాలను ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్ లిమిటెడ్కు బదిలీ చేయనున్నారు.
ఢిల్లీ కన్నాట్ ప్లేస్లోని నాలుగు ఎకరాల భూమి, ఢిల్లీ, ముంబైతో పాటు ఇతర నగరాల్లోని హౌసింగ్ సొసైటీలను ప్రయివేట్ సంస్థలకు అప్పగిస్తారు. ఎయిర్ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లాంటివి కూడా ఒప్పందంలో భాగంగా ఉంటాయి. ఇప్పటికే ఈ సంస్థ కోసం విదేశీ కంపెనీలు పోటీ పడినప్పటికీ... ఆ తర్వాత అప్పుల కారణఁగా కాస్త వెనక్కి తగ్గాయి. ఇప్పుడు టాటా సంస్థ రేసులో నిలవడంతో సంస్థ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.