నేడే.. బీజేపీ కీలక మీటింగ్.. నడ్డా ఫ్యూచర్ తేలేనా?
వచ్చే నెలాఖరుతో జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగియనుంది. ఆయన పదవీకాలం పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ, ఆర్థిక, విదేశాంగ విధానాలపై మూడు వేరువేరు తీర్మానాలు చేయవచ్చని కూడా బీజేపీ నేతలు చెబుతున్నారు. జి20 కి భారత్ నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో.. పార్టీ తరపున విస్తృత ప్రచారం నిర్వహించే విషయంపై కూడా చర్చించి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న 9 రాష్ట్రాల్లో అనుసరించాల్సిన విధానంపై కూడా చర్చించే అవకాశం ఉంది.