పండగ రోజైనా కాస్త నిజాలు చెప్పండి..?

Chakravarthi Kalyan
పండుగ రోజు సైతం  అబద్దాలు చెప్పకుండా ప్రజలకు వాస్తవాలు చెప్పేలా బుద్ధిని రాష్ట్ర పాలకులకు ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నానంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రత్యేక రాష్ట్రం వచ్చి 8 ఏళ్లయినా ధనిక రాష్ట్రం అప్పుల తెలంగాణగా మారినా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడుతున్నారు. దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణ రైతులు నిండా కష్టాల్లో, నష్టాల్లో కూరుకుపోయారని... రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు.

అయినప్పటికీ తన విద్యుక్త ధర్మాన్ని వీడకుండా నీళ్లున్నా లేకున్నా, కరెంట్ వచ్చినా రాకున్నా, పంటకు ధర వచ్చినా రాకున్నా ఆరుగాలం కష్టపడి కలో, గంజో తాగి పంట పండించి దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని బండి సంజయ్ అన్నారు. వచ్చే ఏడాది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని, రాష్ట్రానికి పట్టిన చీడ, పీడలు విరగడై సరికొత్త కాంతులతో రైతన్నలు సుఖసంతోషాల మధ్య  సంక్రాంతి జరుపుకుంటారని ఆశిస్తున్నానని బండి సంజయ్  ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుల తిప్పలు లేని, ఆత్మహత్యల్లేని, కల్లాల దగ్గర కన్నీళ్లులేని సుభిక్ష పాలన రావాలని కోరుకుంటున్నానన్న బండి సంజయ్ .. అప్పటిదాకా కష్టనష్టాలను ఎదుర్కొనే మనోధైర్యం ప్రజలకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: