మార్చిలో విశాఖ గ్లోబల్ సమ్మిట్.. అదిరేలా ఏర్పాట్లు?

Chakravarthi Kalyan
విశాఖలో నిర్వహించనున్న రెండు ప్రతిష్టాత్మక సదస్సుల ఏర్పాట్లను సీఎం వైయస్‌.జగన్‌ సమీక్షించారు. మార్చి 3–4 తేదీల్లో విశాఖలో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. వాస్తవిక పెట్టుబడులు లక్ష్యంగా సదస్సు ముందుకు సాగాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను సమగ్రంగా వివరించేలా కార్యక్రమం రూపొందించాలని సీఎం జగన్ సూచించారు. కొత్త తరహా ఇంధనాల తయారీ సహా ప్రపంచ వ్యాప్తంగా కొత్త తరహా ఉత్పత్తుల తయారీకి ఏపీ వేదిక కావాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.

గ్లోబల్‌  ఇన్వెస్టర్స్‌ సదస్సు ఊతం ఇవ్వాలన్న సీఎం జగన్.. విదేశాల్లో ఎంఎస్‌ఎంఈలు నడుస్తున్న తీరుపై అధ్యయనం చేయాలని సూచించారు. వాటి నిర్వహణా పద్ధతులను మన రాష్ట్రంలో అవలంభించడంపై దృష్టిపెట్టాలని సీఎం జగన్  తెలిపారు. విశాఖపట్నంలో జి–20 సన్నాహక సదస్సు కోసం ఏర్పాట్లు తదితర అంశాలపైనా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: