ఆ రంగంలో తెలంగాణయే నెం.1 ?
ఆరోగ్యరంగంలో తెలంగాణను దేశంలోనే తొలిస్థానంలో నిలుస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇందుకు అంతా కలిసి పనిచేయాలని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. బోధనాస్పత్రుల పనితీరుపై సమీక్ష చేసిన మంత్రి అనవసరంగా పెద్దాస్పత్రులకు రిఫరెన్సులు తగ్గించాలని వైద్యులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందన్న మంత్రి హరీశ్ రావు.. ఇందులో భాగంగా ఆసుపత్రులు బలోపేతం చేసుకుంటున్నామని, అధునాతన వైద్య పరికరాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమకూర్చుకుంటున్నామన్నారు.
కొత్తగా జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు, వైద్య విధాన పరిషత్ ప్రధాన ఆసుపత్రుల అవసరం మేరకు 800 మంది పీజీ సీనియర్ రెసిడెంట్ లను కేటాయించినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. అన్ని వేళలా ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండాలన్న మంత్రి హరీశ్ రావు .. స్పెషాలిటీ సేవలు సైతం జిల్లా పరిధిలోనే ప్రజలకు అందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. టీచింగ్ ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగే దిశగా ప్రయత్నాలు చేయాలన్నమంత్రి హరీశ్ రావు ... అవయవ దానం ప్రోత్సహించి, ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేయాలన్నారు.