ఏపీలో గ్రూప్ వన్ పరీక్ష ప్రారంభం?
మొత్తం 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది. ప్రిలిమినరీ పరీక్షకు హాజరు 1లక్ష 26వేల 449 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. పరీక్ష నిర్వహణ కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసింది. పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ పరీక్ష కోసం ఉద్యోగార్థులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.