2023: తెలుగుదేశం.. అన్‌స్టాపబుల్‌.. ?

Chakravarthi Kalyan
రాష్ట్రంలో 5కోట్ల మంది ఓవైపు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మరోవైపుగా జరిగే పోరాటం అన్ స్టాపబుల్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంటున్నారు. ఈ పోరాటంలో తెలుగుదేశం విజయమూ అన్ స్టాపబుల్ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2022లో బాధల్లో ఏపీ పీక్ కి వెళ్లిపోయిందన్న చంద్రబాబు..., 2023 ఒక ఆశగా వర్ణించారు. ప్రజా తిరుగుబాటుతో వైసీపీలో ఓటమి భయం మొదలైందని..  ఆ పార్టీలో అంతర్యుద్ధం జరుగుతోందని చంద్రబాబు అంటున్నారు. జగన్ పాలనలో 2022 విధ్వంసాల సంవత్సరంగా మిగిలిపోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు.  

వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచీ ప్రతీ ఏడాదీ రాష్ట్రంలో విధ్వంసాలేనని చంద్రబాబు దుయ్యబట్టారు. మహానాడులో ప్రజాచైతన్యం వెల్లువిరిసిందని.. బాదుడే బాదుడుకు మించి ప్రభుత్వ చర్యలు ఉన్నందుకే డిసెంబర్ లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టామని చంద్రబాబు అన్నారు. ప్రజల్లో కదలిక ప్రారంభం మాత్రమేననీ.. వైసీపీకి రోజులైపోయాయని  చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కొన్ని త్యాగాలు తప్పవని చంద్రబాబు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: