2023: తెలుగుదేశం.. అన్స్టాపబుల్.. ?
వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచీ ప్రతీ ఏడాదీ రాష్ట్రంలో విధ్వంసాలేనని చంద్రబాబు దుయ్యబట్టారు. మహానాడులో ప్రజాచైతన్యం వెల్లువిరిసిందని.. బాదుడే బాదుడుకు మించి ప్రభుత్వ చర్యలు ఉన్నందుకే డిసెంబర్ లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టామని చంద్రబాబు అన్నారు. ప్రజల్లో కదలిక ప్రారంభం మాత్రమేననీ.. వైసీపీకి రోజులైపోయాయని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కొన్ని త్యాగాలు తప్పవని చంద్రబాబు స్పష్టం చేశారు.