ఆ విషయంలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్?
చంద్రబాబు హయాంలోనే ఖరీఫ్లో ఉత్పత్తి అతి తక్కువగా జరిగిందన్న ఎంవీఎస్ నాగిరెడ్డి.. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే అత్యధికంగా ఖరీఫ్లో ఉత్పత్తులు సాధించారన్నారు. లాభదాయక పంటలు పండించే విధంగా ప్రభుత్వం పని చేస్తోందని... హార్టికల్చర్ సాగు కూడా పెరిగిందని ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఆక్వా కల్చర్, వ్యవసాయం, హార్టికల్చర్ ఈ మూడు రంగాలు కలిపి సాగు అంచనాలు వేస్తారన్న ఎంవీఎస్ నాగిరెడ్డి.. 40 శాతం హార్టికల్చర్ ఉత్పత్తులు పెరిగాయని తెలిపారు. 2022వ సంవత్సరం జగన్నామ సంక్షేమ సంవత్సరమని ఎంవీఎస్ నాగిరెడ్డి వర్ణించారు. వ్యవసాయ రంగాన్ని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి లాభదాయకంగా చేశారని ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు.