చంద్రబాబు.. అందుకు సారీ చెప్పాల్సిందేనట..?

Chakravarthi Kalyan
ప్రతిప‌క్ష నేత చంద్రబాబు విజ‌య‌న‌గ‌రం ప్రజ‌ల‌కు ముందుగా క్షమాప‌ణ చెప్పి.. ఆ త‌రువాతే జిల్లాలో అడుగుపెట్టాల‌ని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు అంటున్నారు. ఈనెల 24వ తేదీన ప్రతిప‌క్ష నేత‌ నారా చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లాలో ప‌ర్యటించబోతున్నారు. అయితే.. చంద్రబాబు జిల్లా ప్రజ‌ల‌ను అవ‌మాన‌ప‌రిచే విధంగా మాట్లాడార‌ట. అంతే కాదు.. త‌న హ‌యాంలో జిల్లాకు ఏమీ చేయ‌లేక‌పోయార‌ట. ఇప్పుడు ఉత్తరాంధ్రకు రాజ‌ధాని వ‌స్తుంటే అడ్డుకున్న వ్యక్తి ..ఈ ప్రాంతంలో ఎలా ప‌ర్యటిస్తార‌ని మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు  ప్రశ్నించారు.  

చంద్రబాబు నాయుడు తన పాలనలో విజయనగరం జిల్లాకు చేసిందేమీ లేదని మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు  అన్నారు. కేవలం కాగితాలపైనే తమ అభివృద్ధి చూపించి ప్రజలను మభ్య పెట్టారని మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు  మండిప‌డ్డారు.  జగన్ మోహ‌న్‌ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జిల్లాలో ప్రజా ప్రతినిధులు, వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: