ఆ పని చేసిందని.. భార్యకు గుండు కొట్టేశాడు?

Chakravarthi Kalyan
భార్యాభర్తల మధ్య కలహాలు సహజమే..కానీ.. అవి చిరుజల్లుల్లా వచ్చి పోవాలి తప్ప.. తుపానుగా మారకూడదు. అలా మారితే ఆ సంసారం నరకమే అవుతుంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఓ జంట విషయంలో ఇదే జరిగింది. భార్య నిర్లక్ష్యం కారణంగా ఆహారంలో తల వెంట్రుకలు వచ్చాయని మండిపడిన ఓ భర్త ఏకంగా తన భార్యకు గుండు కొట్టించాడు.

వివరాల్లోకి వెళ్తే ఉత్తర్‌ ప్రదేశ్‌ పీలీభీత్‌ జిల్లా మిలాక్‌ గ్రామ వాసి జహీరుద్దీన్‌కు, సీమాదేవితో ఏడు ఏళ్ల క్రితం పెళ్లయింది. ఇటీవల సీమాదేవి భర్తకు వడ్డించిన ఆహారంలో ఓ వెంట్రుక కనిపించింది. అంతే జహీరుద్దీన్‌కు కోపం నషాళానికి అంటింది. అతడు తనపై చేయి చేసుకోవడమే కాకుండా.. ఏకంగా  భార్యకు గుండు కొట్టించేశాడు. దీంతో అవాక్కయిన భార్య ఆ తర్వాత ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు..  పెళ్లయినప్పటి నుంచి లక్షలు కట్నం ఇవ్వాలని అత్తింటి వారు తనను వేధిస్తున్నారని కూడా కేసు పెట్టింది. దీంతో పోలీసులు ఆమె భర్త, అత్తింటి వారిపై వరకట్న చట్టంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చివరకు ఆ భర్తను జైలుకు పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: