కేసీఆర్ గుడ్న్యూస్: ఆ భూములకు పట్టాలు..?
రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమం కోసం పనిచేయాలని మంత్రి సత్యవతి రాధోడ్ కోరారు. గిరివికాస్ పథకాన్ని రైతులు సద్వినియోగంచేసుకునేలా చూడాలని సత్యవతి రాథోడ్ సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు... పోడుభూముల సర్వే పూర్తిచేసి గ్రామ, డివిజన్, జిల్లా సభలు నిర్వహించాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి,పోడు భూముల సర్వేకార్యక్రమాలు పొందుపర్చేందుకు అధికారులకు ట్యాబ్స్ అందించినట్లు మంత్రి సత్యవతి రాధోడ్ తెలిపారు. నిబంధనల ప్రకారం ఉన్న పోడు భూముల పట్టాలను వచ్చేనెలలో లబ్దిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.