పవన్ హడావిడి.. అందుకోసమేనా?

Chakravarthi Kalyan
పవన్ కల్యాణ్‌ తాజాగా విజయనగరం జిల్లా గుంకలాం వెళ్లారు. అక్కడ జగనన్న కాలనీల నిర్మాణాన్ని పరిశీలించారు. అయితే.. తన పర్యటనకు కారణం తెలియకుండా అవినీతి జరిగిందంటూ కేకలు వేస్తూ, తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి పవన్ కళ్యాణ్ గుంకలాం పర్యటన చేశారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు. జగనన్న ఇళ్లు- పేదలకు కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఉప సభాపతి కోలగట్ల స్పందించారు.

వచ్చావు.. చూసావు.. వెళ్లావు.. తప్ప గుంకలాములో ఒక రూపాయి అయినా అవినీతిని చూపించగలవా పవన్ కళ్యాణ్  అని కోలగట్ల ప్రశ్నించారు. మంత్రుల అవినీతి గురించి పవన్ మాట్లాడారని.. కానీ.. వాటిని  నిరూపించే సత్తా పవన్ కళ్యాణ్ కి ఉందా అని కోలగట్ల ప్రశ్నించారు. గుంకలాం పర్యటనలో పవన్ కళ్యాణ్ ఒక్క లబ్ధిదారుడుతో  కూడా మాట్లాడలేదని కోలగట్ల ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: