ఆంధ్రప్రదేశ్కు కీలక వాతావరణ హెచ్చరిక..?
ఈ ప్రభావం వల్ల 11వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలో చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది. కోస్తాంధ్ర, తమిళనాడు తీరాల్లో 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే రెండు రోజులు మాత్రం కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.