భారత్, చైనా సరిహద్దుల్లో కీలక పరిణామాలు?
పీపీ-15 నుంచి రెండు దేశాల సైనికుల ఉపసంహరణ జరిగింది. దెమ్ చోక్ , దెప్సాంగ్ ప్రాంతాల్లో వివాదాలను పరిష్కరించుకునే అంశంలో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. 2020 జూన్ లో జరిగిన గల్వాన్ ఘటన తర్వాత వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఆ తర్వాత భారత్ -చైనా సైనికాధికారులు పలు దఫాలు చర్చలు జరిపారు. 16వ విడతలో భాగంగా మేజర్ జనరల్ స్థాయిలో చర్చలు జరిగాయి. ఫలితంగా పాంగాంగ్ సరస్సు, గోగ్రాపోస్టు వద్ద బలగాల ఉపసంహరణ జరిగింది. జులై 17 చర్చల ఫలితంగా ఇప్పుడు గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ నుంచి బలగాలు వైదొలిగాయి.