ఆ కానిస్టేబుల్‌ గురించి అసెంబ్లీలో టీడీపీ ఫైట్‌ ?

Chakravarthi Kalyan
ఇటీవల టీడీపీ  ప్రభుత్వాన్ని విమర్శించిన ఏఆర్‌ కానిస్టేబుల్ ప్రకాశ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. పోలీసులతో తనకు ప్రాణహానీ ఉన్నందున రక్షణ కల్పించేలా చూడాలని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో అధినేత చంద్రబాబుని అనంతపురం ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ కలిశారు. ప్రకాష్ తో పాటు చంద్రబాబుని బాధిత మహిళ శ్రీలక్ష్మి కూడా కలిశారు.
కేసు విషయమై పోలీసులు రాత్రులు వచ్చి బెదిరిస్తున్నారని శ్రీలక్ష్మి కూడా వాపోయింది. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు ఆ ఇద్దరికీ హామీ ఇచ్చారు. ప్రకాష్ కు జరిగిన అన్యాయం పై అసెంబ్లీలో లేవనెత్తాలని చంద్రబాబు ఆదేశించారు. టీడీఎల్పీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు అధినేత సూచించారు. ఈ సందర్భంగా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్..  ప్రకాష్ కు తన నెలజీతం, ఇతర ప్రోత్సాహకాలు కలిపి దాదాపు రూ.2లక్షల వరకు అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: