ప్రముఖ హీరో హత్యకు భారీ కుట్ర..?
ఇదంతా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పనేనట. ఆయన సూచనల మేరకే ఈ రెక్కీ జరిగినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వివరించారు. మూసేవాలా హత్య అనంతరం అదే రీతిలో చంపేస్తామంటూ కొందరు ఆగంతుకులు సల్మాన్, ఆయన తండ్రి సలీంఖాన్ను లెటర్ ద్వారా బెదిరించారు. ఈ బెదిరింపులపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ వివరాలు బయటకొచ్చాయి. మూసేవాలా హత్యకేసు నిందితుడు కపిల్ పండిట్ను విచారిస్తే ఈ విషయం బయటకొచ్చిందట. లారెన్స్ బిష్ణోయ్ సూచనల మేరకు సల్మాన్ఖాన్ లక్ష్యంగా ఈ గ్యాంగ్ రెక్కీ చేసిందట.