ప్రముఖ హీరో హత్యకు భారీ కుట్ర..?

Chakravarthi Kalyan
ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడి హత్యకు జరిగిన కుట్రను పోలీసులు బయటపెట్టారు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌ హత్య కోసం నిందితులు రెక్కీ నిర్వహించినట్టు పంజాబ్ పోలీసులు వెల్లడించారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకేసు నిందితులే సల్మాన్‌ ఖాన్‌ లక్ష్యంగా ముంబయిలో రెక్కీ నిర్వహించారట. ఈ విషయాన్ని పంజాబ్‌ డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ తెలిపారు.

ఇదంతా గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ పనేనట. ఆయన సూచనల మేరకే ఈ రెక్కీ జరిగినట్లు  పంజాబ్‌ డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ వివరించారు. మూసేవాలా హత్య అనంతరం అదే రీతిలో చంపేస్తామంటూ కొందరు ఆగంతుకులు సల్మాన్‌, ఆయన తండ్రి సలీంఖాన్‌ను లెటర్ ద్వారా బెదిరించారు. ఈ బెదిరింపులపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ వివరాలు బయటకొచ్చాయి. మూసేవాలా హత్యకేసు నిందితుడు కపిల్‌ పండిట్‌ను విచారిస్తే ఈ విషయం బయటకొచ్చిందట. లారెన్స్‌ బిష్ణోయ్‌ సూచనల మేరకు సల్మాన్‌ఖాన్‌ లక్ష్యంగా ఈ గ్యాంగ్ రెక్కీ చేసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: