సీఎం జగన్ ఇవాళ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ను సీఎం జగన్ ప్రారంభిస్తారు. గతేడాది మంత్రి మేకపాటి హఠాన్మరణం తర్వాత సంగం బ్యారేజ్కు మేకపాటి పేరు పెడతామని సీఎం ప్రకటించారు. అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు జగన్ నిలబెట్టుకున్నారు. జగన్ నెల్లూరు చేరుకుని నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. దాన్ని జాతికి అంకితం చేస్తారు. సంగం బ్యారేజీ వద్ద వైయస్ఆర్, మేకపాటి గౌతంరెడ్డి కాంస్య విగ్రహాలు ఆవిష్కరిస్తారు. సీఎం వైయస్ జగన్ ఉదయం 10.40 గంటలకు సంగం చేరుకుంటారు.
11–1.10 గంటల మధ్య మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ను సీఎం ప్రారంభిస్తారు. అక్కడ బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఒకటిన్నరకు సీఎం జగన్ నెల్లూరు బ్యారేజ్ వద్దకు చేరుకుంటారు. 2 గంటలకు నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని సీఎం జగన్ ప్రారంభిస్తారు. నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జి వద్ద వైయస్ఆర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరిస్తారు. రెండున్నర గంటలకు సీఎం జగన్ అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని సీఎంఓ తెలిపింది.