చైనా డీలా.. దూసుకుపోతున్న ఇండియా?

Chakravarthi Kalyan
అవును ఇండియా దూసుకుపోతోంది. ఆర్థికాభివృద్ధి విషయంలో ఇండియా దూసుకుపోతోంది. ప్రత్యేకించి వృద్ధి రేటు విషయంలో ఇండియా చైనాకు షాక్ ఇస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం లెక్కలు ఈ విషయాన్ని చాటి చెబుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 13.5 శాతంగా నమోదు కావడం విశేషం.

జాతీయ గణాంక కార్యాలయం అధికారిక డేటాలో  ఈ గణాంకాలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు 20.1 శాతంగా నమోదు అయ్యింది. ఇది ఇప్పుడు కాస్త తగ్గినా.. ఇంకా చెప్పుకోదగ్గస్థాయిలోనే నమోదైంది. భారత ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధి నమోదు చేస్తుందని అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు అవి నిజం అవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 15.7 శాతం వృద్ధి నమోదవుతుందని స్టేట్ బ్యాంకు అంచనా వేసింది.  16.2 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. అయితే.. 2022-23 తొలి త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు కేవలం 0.4 మాత్రమే ఉండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: