ఏపీకి గుడ్ న్యూస్.. ఏకంగా రూ.6వేల 756 కోట్లు?
ఈ అంశం కేంద్రం వద్ద ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. సీఎం డిల్లీ వెళ్లినప్పుడల్లా ఈ బకాయిలు ఇప్పించాలని కోరుతున్నారు. మొత్తానికి ఇప్పుడు కేంద్రం స్పందించింది. 3441.78 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాలని.. దీనితో పాటు 2022 జూలై 31 తేదీ వరకూ ఆలస్య రుసుముగా మరో 3315 కోట్ల రూపాయలు చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. నెలరోజుల్లోగా ఈ మొత్తాన్ని ఏపి కి తెలంగాణ కట్టాలని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అనూప్ సింగ్ ఆదేశించారు.