వినాయకచవితికి సెలవు ఇవ్వరా.. ఇదేం దారుణం?

Chakravarthi Kalyan
వినాయకచవితికి బ్యాంకు ఉద్యోగులకు ఎన్ ఐ యాక్ట్ ప్రకారం ఈ నెల 31న సెలవు ప్రకటించాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ డిమాండ్ చేస్తోంది. ఈనెల 31న బ్యాంకు ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని ఇప్పటికే  సీఎం జగన్,  చీఫ్ సెక్రటరీకి  యునైటెడ్ ఫోరమ్స్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్  తరపున లేఖలు రాశాయి. అయినా ఇప్పటికీ సెలవు మంజూరు చేయకపోవడం శోచనీయమని ఆ సంఘం కన్వీనర్ బీఎస్ రాంబాబు అంటున్నారు. దేశవ్యాప్తంగా వినాయక చవితిని భక్తి శ్రద్దలతో ఘనంగా జరపుకుంటారని.. ఏపీలో మాత్రం సెలవు ఇవ్వడం లేదని ఆయన అన్నారు.  
దేశం మొత్తం సెలవు ఇచ్చినా.. ఏపీలో మాత్రం ఇప్పటి వరకు సెలవు ఇవ్వక పోవడం శోచనీయమని బీఎస్ రాంబాబు అన్నారు. ఏపీ ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ సెలవు ప్రకటించినా బ్యాంకు ఉద్యోగులకు సెలవు ఇవ్వలేదని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: