హవ్వ.. జగన్కు కిమ్తో పోలికా?
చంద్రబాబు చలవతో సైజు కుదించుకుపోయిన ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్లో ఐదేళ్ల బాబూకొడుకుల పాలన తర్వాత కూడా ఇంకా ప్రజాస్వామ్యం బతికి ఉందని విజయసాయిరెడ్డి అన్నారు. వ్యవస్థలను పరిరక్షించే బాధ్యతను సిఎం జగన్ చక్కగా నిర్వర్తిస్తున్నారన్న విజయసాయిరెడ్డి ... రెండు పొరుగు రాష్ట్రాల నీడన ఇంకా వెనుకబడి ఉన్న కుప్పంలో మూడు రోజల కుప్పిగంతుల తర్వాత మాజీ సీఎం బాబుగారు తన నాటకాలకు తెర దించారు... సంతోషం... అంటూ ఎద్దేవా చేశారు.