ఎంబీబీఎస్ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల?

Chakravarthi Kalyan
తెలంగాణలో ఎంబీబీఎస్‌ ఫలితాలు విడుదలయ్యాయి.. ఈ ఫలితాలను కాళోజీ ఆరోగ్య వైద్య  విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈ ఏడాది ఎంబీబీఎస్‌ ఫైనల్ ఇయర్ ఫలితాల్లో 92.21%  మంది ఉత్తీర్ణులయ్యారు. యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఫలితాలు ఉంచారు. ఎంబీబీఎస్ ఫైనలియర్‌ పరీక్షల ఫలితాలను కాళోజీ ఆరోగ్య వైద్య  విశ్వవిద్యాలయం తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది మే నెలలోనే జరిగిన ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం పార్ట్‌ –2  పరీక్షల్లో మొత్తం 92.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

వీరిలో 34 మంది డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులు అయ్యారు. మరో  1034 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో నిలిచారు. మొత్తం 2807 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ వై మల్లేశ్వర్ తెలిపారు. ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం  ఫలితాలను విశ్వవిద్యాలయం వెబ్‌ సైట్‌ www. knruhs.telangana.gov.in లో చూసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ వై మల్లేశ్వర్  ఒక ప్రకటనలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: