జాగ్రత్త జగన్‌.. అక్కడకు బాబు వెళ్తున్నాడు?

Chakravarthi Kalyan
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు, రేపు వరద ముంపు గ్రామాల్లో పర్యటించబోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంకలో చంద్రబాబు పర్యటిస్తారు. అయోధ్యలంక, నాగుల్లంకకు బోటులో వెళ్లి చంద్రబాబు బాధితులను పరామర్శిస్తారని టీడీపీ తెలిపింది. పి.గన్నవరం, మామిడికుదురు, రాజోలు మండలాల్లోనూ చంద్రబాబు పర్యటన ఉంటుంది. వీటితో పాటు మానేపల్లి, అప్పనపల్లి, రాజోలు గ్రామాల్లోనూ చంద్రబాబు పర్యటిస్తారు.
ఈ రాత్రికి చంద్రబాబు పాలకొల్లులో బస చేస్తారు. రేపు యలమంచిలి మండలంలో చంద్రబాబు పర్యటన ఉంటుంది. దొడ్డిబట్ల, అబ్బిరాజు పాలెం, గంగాధరపాలెం, లక్ష్మీపురం గ్రామాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. నర్సాపురం పరిధి పొన్నపల్లిలో చంద్రబాబు తన పర్యటన ముగిస్తారు.
బాధితులకు భరోసా ఇచ్చే విధంగా చంద్రబాబు పర్యటన ఉంటుందని టీడీపీ తెలిపింది. అయితే.. బాధితులను అన్నిరకాలుగా ఆదుకుంటున్నామంటున్న జగన్ సర్కారు జాగ్రత్తగా ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: