ఆ విషయంలో ఏపీని ఆపండి.. తెలంగాణ కంప్లయింట్‌?

Chakravarthi Kalyan
ఏపీ, తెలంగాణ మధ్య అనేక జల జగడాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తెలంగాణ ఏపీపై ఫిర్యాదు చేసింది. ఆర్డీఎస్ కుడికాల్వ పనులపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు అభ‌్యంతరం వ్యక్తం చేస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్రం ఫిర్యాదు చేసింది. ఆర్డీఎస్ కుడికాల్వ పనుల విషయంలో ఎలాంటి అనుమతి లేకున్నా ఏపీ పనులు కొనసాగిస్తోందని తెలంగాణ ఫిర్యాదు చేసింది.
కేఆర్‌ఎంబీ ఆదేశాలకు విరుద్ధంగా ఆర్డీఎస్ కుడికాల్వ పనులు జరుగుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆర్డీఎస్ కుడికాల్వ పనుల విషయంలో ఏపీని నిలువరించాలని కోరిన తెలంగాణ కోరింది. పనులు జరగకుండా చేయాలని కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాసింది.  మరి ఈ ఫిర్యాదుపై కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: