ఈ రాత్రికే జగన్ ఫారిన్ టూర్.. ఎక్కడెక్కడికంటే?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ మరోసారి విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు  సతీసమేతంగా పారిస్ బయలుదేరి వెళ్లనున్నారు.  ఇవాళ రాత్రి 7.30 నిమిషాలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ కుటుంబం గన్నవరం విమానాశ్రయానికి బయలు దేరుతుంది. రాత్రి 8 గంటలకు  అక్కడినుంచి విమానంలో జగన్ పారిస్ కు బయలు దేరతారు.

ఈ నెల 29న పారిస్ కు సీఎం దంపతులు చేరుకుంటారు. జూలై 2న సీఎం పెద్ద కుమార్తె హర్షా రెడ్డి చదువుతున్న యూనివర్సిటీ కాన్వొకేషన్ లో సీఎం జగన్, సతీమణి భారతి  పాల్గొంటారు. ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ ఇన్సీడ్ నుంచి హర్షారెడ్డి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని అందుకుంటారు. ఆ కార్యక్రమానికి సీఎం జగన్ దంపతులు హాజరవుతున్నారు. సీఎం దంపతులు మళ్లీ జూలై 3న తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఇదీ ఈసారి సీఎం జగన్ టూర్ షెడ్యూల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: