అంతా అవినీతే.. రెచ్చిపోయిన వైసీపీ ఎంపీ?

Chakravarthi Kalyan
ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. అందుకే టీడీపీ నేతలు వైసీపీ పాలనలో అవినీతే ఉందని ఆరోపిస్తుంటారు. కానీ.. ఏపీలో వైసీపీ పాలనలో ఉండగా.. అంతా అవినీతే జరుగుతోందని ఓ వైసీపీ ఎంపీ అంటే ఎలా ఉంటుంది.. ఇప్పుడు అదే జరుగుతోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘం లిమిటెడ్‌లో అంతా అవినీతే జరుగుతోందని సాక్షాత్తూ అధికార పార్టీ ఎంపీ ఆరోపిస్తున్నారు.
చీపురుపల్లి ఆర్‌ఈసీఎస్‌పై ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చీపురుపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘం లిమిటెడ్‌లో  అవినీతి రాజ్యమేలుతోందని ఎంపీ బెల్లాన ఆరోపించారు. ఆ సంస్థకుఎండీ రమేష్ ఉన్నంతవరకు ఆర్ఈసీఎస్‌కు మనుగడ లేదని ఎంపీ బెల్లాన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఈసీఎస్ అవినీతిపై గతంలో తామే ధర్నాలు చేశామని.. అయినా అధికారులు ఇప్పుడు ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థంకావట్లేదని ఎంపీ బెల్లాన అంటున్నారు. త్వరలోనే దీని సంగతి తేలుస్తానంటున్నారు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: