ఇవాళ్టి నుంచే బడులు ప్రారంభం?

Chakravarthi Kalyan
వేసవి సెలవులు ముగిశాయి.. తెలంగాణలో ఇవాళ్టి నుంచి బడులు ప్రారంభం అవుతున్నాయి. ఇవాళ్టి  నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. పాఠశాలల ప్రారంభం కోసం ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆమె నిన్ననే సూచించారు. వేసవి సెలవులు పొడిగింపు లేదని సబిత క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 65లక్షల మంది పిల్లలకు బడులు స్వాగతం పలుకుతున్నాయని మంత్రి సబిత తెలిపారు.
అంతే కాదు.. స్థానిక ప్రజాప్రతినిధులు పాఠశాలలకు వెళ్లి పిల్లలకు స్వాగతం పలకాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన చేశారు. మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో 9వేల పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. పాఠశాలలు ప్రారంభం అయినా..  విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగుతాయని మంత్రి సబితా వెల్లడించారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన అమలులోకి వస్తుందని సబిత తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: