ఇవాళ్టి నుంచే బడులు ప్రారంభం?
అంతే కాదు.. స్థానిక ప్రజాప్రతినిధులు పాఠశాలలకు వెళ్లి పిల్లలకు స్వాగతం పలకాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన చేశారు. మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో 9వేల పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. పాఠశాలలు ప్రారంభం అయినా.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగుతాయని మంత్రి సబితా వెల్లడించారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన అమలులోకి వస్తుందని సబిత తెలిపారు.