ఉక్రెయిన్ యుద్ధం: అయ్యో భారత్కు ఇంత నష్టమా?
ఆ సంస్థలు ఏంటంటే.. ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ , భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కన్సార్టియం మొదలైనవి.. రష్యాకు చెందిన వ్యాంకోర్ నెఫ్ట్ చమురు ప్రాజెక్టులో 23.9శాతం, టాస్ -యుర్ యాక్ ఆయిల్ ఫీల్డ్ లో 29.9శాతం ఈ సంస్థలకు వాటాలు ఉన్నాయి. భారత కంపెనీలకు డివిడెంట్ల రూపంలో 975 కోట్ల వరకూ రావాల్సి ఉంది. అయితే.. ఆంక్షల కారణంగా ఆ సొమ్మంతా రష్యా బ్యాంకుల్లోనే ఉండిపోయింది. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ నుంచి రష్యా బ్యాంకులను బహిష్కరించటం వల్ల ఇలా జరిగింది.