వావ్.. జగన్, కేటీఆర్‌.. అపూర్వ కలయిక?

Chakravarthi Kalyan
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో నిన్న ఓ అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ సదస్సుకు హాజరైన తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ జగన్ దావోస్ లో పర్యటిస్తున్నారు. ఆయనను కేటీఆర్‌ కలిసి ఆప్యాయంగా పలకరించుకున్నారు.
ఈ భేటీ గురించి కేటీఆర్‌ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేశారు. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో.. గొప్ప సమావేశం జరిగినట్లు కేటీఆర్ పోస్టులో తెలిపారు.  ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్‌ గా మారుతున్నాయి. కేటీఆర్, జగన్ మధ్య మొదటి నుంచి మంచి సంబంధాలే ఉన్నాయి. కేటీఆర్‌ మహారాష్ట్ర మంత్రి ఆదిత్యా థాకరేతో కూడా సమావేశం అయ్యారు. తెలంగాణ, మహారాష్ట్ర కలిసి పనిచేసే అంశాలపై ఇరువురు చర్చలు జరిపినట్టు కేటీఆర్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: