మరో శ్రీలంకగా ఏపీ.. ఇదిగో ఉదాహరణ?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకగా మారుతోందా.. అప్పుల ఊబిలో కూరుకుపోతోందా.. కొన్ని రోజులుగా విపక్షాల నుంచి వినిపిస్తున్న ఆరోపణ ఇది. ఇప్పుడు అవే విపక్షాలు అందుకు సాక్ష్యం అంటూ కొన్ని ఘటనలు వివరిస్తున్నాయి. రాష్ట్రంలో రేషన్ బియ్యం రద్దు చేయడం ఇందుకు తాజా తార్కాణమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు అంటున్నారు. కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యాన్ని కూడా సొంత అవసరాలకు మలచుకునేందుకు వైకాపా నేతలు మాఫియాతో కుమ్మక్కయ్యారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

ఏప్రిల్, మే నెల బియ్యాన్ని తక్షణమే పేదలకు అందచేయాలని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు  డిమాండ్ చేసారు. వైసీపీ పేదల వ్యతిరేక ప్రభుత్వమని రేషన్ బియ్యం రద్దుతో మరోసారి రుజువైందని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. పేదల పొట్టకొడుతూ వారి పాలిట కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరించటం దిగజారుడేనని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: