ఆ జీవోతో జగన్ వాళ్ల కొంప ముంచేశారా?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ తమది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. కానీ.. ఇదే ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో లక్షల మంది బలైపోతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. జగన్ సర్కారు తెచ్చిన 217 జీవోతో మత్య్సకారుల జీవనోపాధిని జగన్ రెడ్డి నిలువునా ముంచారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అంటున్నారు.
మొత్తం మత్య్సకార వృత్తిలో 15 లక్షల మంది ఉంటే , మత్య్సకార భరోసా కేవలం లక్షా 8 వేల మందికి మాత్రమే ఇస్తున్నారని కొల్లు రవీంద్ర అంటున్నారు. మత్య్సకార భరోసా  10వేల రూపాయలు ఇచ్చి, పెంచిన ఛార్జీలు, నిత్యావసర ధరలతో 30వేల రూపాయలు వరకూ జగన్ గుంజుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. జగన్ సర్కారు తెచ్చిన 217 జీవోతో మత్య్సకారుల జీవనోపాధిని పెను ముప్పు దాపురించిందని.. మత్స్యకారులు తమ హక్కులను కోల్పోతున్నారని కొల్లు రవీంద్ర ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: