ఆ జీవోతో జగన్ వాళ్ల కొంప ముంచేశారా?
మొత్తం మత్య్సకార వృత్తిలో 15 లక్షల మంది ఉంటే , మత్య్సకార భరోసా కేవలం లక్షా 8 వేల మందికి మాత్రమే ఇస్తున్నారని కొల్లు రవీంద్ర అంటున్నారు. మత్య్సకార భరోసా 10వేల రూపాయలు ఇచ్చి, పెంచిన ఛార్జీలు, నిత్యావసర ధరలతో 30వేల రూపాయలు వరకూ జగన్ గుంజుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. జగన్ సర్కారు తెచ్చిన 217 జీవోతో మత్య్సకారుల జీవనోపాధిని పెను ముప్పు దాపురించిందని.. మత్స్యకారులు తమ హక్కులను కోల్పోతున్నారని కొల్లు రవీంద్ర ఆరోపిస్తున్నారు.