ఆ చెన్నై రెడ్డి గారి ఇసుక దోపిడీ నిజమేనా?

Chakravarthi Kalyan
ఏపీలో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయా.. జగన్ సర్కారును అడ్డుపెట్టుకుని చెన్నైకు చెందిన ఓ రెడ్డిగారు ఇసుక దోపిడీ సాగిస్తున్నారా.. అంటే అవునంటున్నారు టీడీపీ నేతలు.. ఇసుకను అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని లూటీ చేయడానికి జగన్ ఇసుకాసుర అవతారమెత్తారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి అంటున్నారు.

టీడీపీ  హయాంలో చంద్రబాబు ఉచితంగా ఇసుకను  అందించారంటున్న పట్టాభి.. జగన్ ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి వేల కోట్ల రూపాయల దోపిడీకి తెగబడ్డాడని ఆరోపించారు. పేరుకే జేపీ సంస్థ పనులు చేపడుతున్నాయని.. ఇసుక ర్యాంపుల్లో చక్రం తిప్పేదంతా చెన్నై శేఖర్ రెడ్డికి చెందిన టర్న్ కీ ఎంటర్ ప్రైజెస్ సంస్థ అని పట్టాభి మండిపడ్డారు.

రాష్ట్రంలో ఏ ఇసుక రీచ్ కు వెళ్లినా శేఖర్ రెడ్డి టర్న్ కీ ప్రతినిధులే కనబడతారని పట్టాభి విమర్శించారు. జగన్ రెడ్డి కనుసన్నల్లో శేఖర్ రెడ్డి రాష్ట్రంలో శాండ్ మాఫియా మొత్తాన్ని నడిపిస్తున్నాడని పట్టాభి విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: