పోలవరంలో అంబటి రాంబాబు?
అలాగే ఎగువ కాపర్ డ్యామ్, జల విద్యుత్ కేంద్రం పనులను ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ఆ తర్వాత ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. పోలవరం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సూచించారు. ఇటీవల అంబటి రాంబాబు పోలవరం నిర్మాణంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. పోలవరంలో డయాఫ్రమ్ వాల్ పాడైపోయిన విషయాన్ని ఆయన బయటపెట్టారు.