హైదరాబాద్‌ వచ్చి కేసీఆర్‌తో ప్రశాంత్‌ కిషోర్‌ భేటీ ?

Chakravarthi Kalyan
హైదరాబాద్ వచ్చిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఆయన సీఎం కేసిఆర్ తో రాజకీయ వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఒకటి, రెండు రోజులు ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్‌లోనే ఉండే అవకాశం ఉంది. ఆయన రెండు రోజుల పాటు కేసీఆర్‌తో విడతల వారీగా చర్చించే అవకాశం ఉంది.

ఇప్పటికే ఇటీవల రెండు సార్లు ప్రశాంత్ కిషోర్‌ కాంగ్రెస్ అధినాయకత్వం సోనియా, రాహుల్‌తో భేటీ అయ్యారు. ఆయన కాంగ్రెస్‌లో చేరతారన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌తో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయాలని ఇటీవల ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు సూచించినట్టు వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్‌, కేసీఆర్‌ మధ్య రాజకీయ చర్చలు జరగడం ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ కిషోర్‌తో తనకు ఎప్పటి నుంచో స్నేహం ఉందని ఇటీవల కేసీఆర్ కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: