హైదరాబాద్ వచ్చి కేసీఆర్తో ప్రశాంత్ కిషోర్ భేటీ ?
ఇప్పటికే ఇటీవల రెండు సార్లు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అధినాయకత్వం సోనియా, రాహుల్తో భేటీ అయ్యారు. ఆయన కాంగ్రెస్లో చేరతారన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్తో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయాలని ఇటీవల ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ హైకమాండ్కు సూచించినట్టు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్, కేసీఆర్ మధ్య రాజకీయ చర్చలు జరగడం ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ కిషోర్తో తనకు ఎప్పటి నుంచో స్నేహం ఉందని ఇటీవల కేసీఆర్ కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే.