ఇవాళ జగన్ కీలక భేటీ.. ఆ విషయం తేల్చేస్తారా?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ ఇవాళ కీలక భేటీ నిర్వహించబోతున్నారు. కొత్త జిల్లాలపై సీఎం జగన్ అధ్యక్షతన ఇవాళ ఉన్నతస్థాయి భేటీ జరగబోతోంది. కొత్త జిల్లాలపై సమావేశంలో సీఎం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉగాది నుంచే కొత్త జిల్లాల్లో పాలన సాగించేలా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని గతంలో జగన్ నిర్దేశించిన సంగతి తెలిసిందే. అందుకు సమయం దగ్గర పడుతుండటంతో కొన్ని జిల్లాల డిమాండ్ల విషయంలో జగన్ ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ్టి భేటీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కొన్ని జిల్లాల ఏర్పాటు విషయంలోనూ.. కొన్ని కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రత్యేకించి మార్కాపురం జిల్లా కోసం బాగా డిమాండ్ వినిపిస్తోంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా విషయంలోనూ జిల్లా కేంద్రంపై గొడవ జరుగుతోంది.దీనిపై నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. ఈ రెండు విషయాల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: