తెలంగాణకు బ్రహ్మాండమైన గుడ్‌ న్యూస్ తెచ్చిన కేటీఆర్‌?

Chakravarthi Kalyan
తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది. ఆయన చివరి రోజు పర్యటన భారీ పెట్టుబడులు సాధించింది. చివరి రోజు ఒక్క రోజే తెలంగాణలో 4 సంస్థలు పెట్టుబడి పెడతామంటూ ప్రకటించాయి. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీలు  ముందుకు వచ్చాయి. కేటీఆర్‌తో సమావేశం అనంతరం ఈ కంపెనీలు తమ నిర్ణయాలు ప్రకటించాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆర్.ఏ చెమ్ ఫార్మా లిమిటెడ్ , అవ్రా ల్యాబొరేటరీస్ లో అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ రూ1750 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. అలాగే న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న స్లేబ్యాక్ ఫార్మా హైదరాబాద్ లో సుమారు 150 కోట్ల రూపాయల పెట్టుబడికి ముందుకొచ్చింది. యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా రెండు లక్షల డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో నిరంతర ఔషధ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. క్యూరియా గ్లోబల్ హైదరాబాద్ లో గ్లోబల్ షేర్డ్ సర్వీసెస్ సెంటర్ ఏర్పాటుతో 200 హై స్కిల్డ్ ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr

సంబంధిత వార్తలు: