ఇవాళ జగన్‌ బ్రాండ్‌పై టీడీపీ నిరసనల పోరాటం

Chakravarthi Kalyan
ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని తెలుగు దేశం పార్టీ నిర్ణయించింది. నాటుసారా, జగన్ బ్రాండ్లను నిషేధించాలని తెలుగు దేశం పార్టీ నిరసనలు తెలపాలని నిర్ణయించింది. దీంతో పాటు అసెంబ్లీలో ఎమ్మెల్యేల పోరాటానికి మద్దతుగా గ్రామస్థాయిలో నిరసనలు తెలపనుంది. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో నాటుసారా కారణంగా 20 మంది  పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని తెలుగుదేశం తన అస్త్రంగా మలచుకుటోంది. ఇటీవల సీఎం జగన్ అసెంబ్లీలో దీనిపై ఇచ్చిన వివరణపైనా తెలుగు దేశం మండిపడింది. రాష్ట్రంలో జగన్ బ్రాండ్‌ పేరుతో పిచ్చి పిచ్చి బ్రాండ్లు తయారు చేసిన ప్రజల ఆరోగ్యం దెబ్బ తీస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.  ఇప్పుడు ఈ అంశాన్ని ఫోకస్ చేసి పదే పదే జె బ్రాండ్‌ మద్యం అంటూ ఆరోపణలు చేస్తోంది. ఇవాళ ఆ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు శ్రీకారం చుట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: