ఆర్మి హెలికాప్ట‌ర్ ఘ‌ట‌న‌లో చిత్తూరు జిల్లా వాసి మృతి

N ANJANEYULU
త‌మిళ‌నాడులో  చోటు చేసుకున్న హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌తో పాటు 11 మంది సాయుధ బ‌ల‌గాల సిబ్బంది అక‌స్మికంగా మృతి చెందిన విష‌యం విధిత‌మే. అయితే సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణించిన‌ హెలికాప్ట‌ర్‌లోనే తెలుగు రాష్ట్రానికి చెందిన సాయితేజ  క‌న్నుమూసారు.  


బిపిన్ రావ‌త్‌కు లాన్స్ నాయ‌క్ హోదాలో  సెక్యూరిటీ విభాగం కింద నిధులు నిర్వ‌హిస్తున్నారు సాయితేజ‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కుర‌బ‌ల‌కోట మండ‌లం ఎగువ రేగడ గ్రామానికి చెందిన జ‌వాన్ సాయితేజ రావ‌త్ కు ప‌ర్స‌న‌ల్ సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నాడు. ఇవాళ ఉద‌యం భార్య‌తో ఫోన్‌లో మాట్లాడారు తేజ‌. ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ప్ప‌టి నుంచి సాయితేజ ఫోన్ స్విచ్ ఆఫ్ వ‌స్తుండ‌డంతో.. కుటుంబ స‌భ్యులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. సాయితేజ‌కు భార్య‌తో పాటు ఇద్ద‌రు పిల్ల‌లు (పాప‌, బాబు) క‌ల‌రు. ఆర్మీ అధికారులు సాయితేజ కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించ‌డంతో కుటుంబ స‌భ్యులు క‌న్నీటి ప‌ర్వంత‌మ‌య్యారు. రేగ‌డ గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. జ‌వాన్ సాయితేజ మృతి ప‌ట్ల ఏపీకి చెందిన ప‌లువురు సంతాపం ప్ర‌క‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: