ఓటీఎస్పై క్లారిటీ ఇచ్చిన మంత్రి అవంతి శ్రీనివాస్
తాజాగా విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం అభివృద్ధి పై మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. ముఖ్యంగా భీమిలిలో భూ సంబంధిత సమస్యలు ఎక్కువగావున్నాయని, వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి అవంతి. అదేవిధంగా ఎండోమెంట్ భూములను రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదని, భీమిలీలో పదివేల మందికి పైగా ఇండ్ల పట్టాలు ఇచ్చామని గుర్తు చేసారు.
ఓటీఎస్ పై ప్రజలు స్వచ్ఛందంగానే ముందుకొచ్చి కడుతున్నారని ఎవరినీ బలవంతం పెట్టడం లేదని చెప్పారు మంత్రి అవంతి. ఓటీఎస్ కట్టని వారికి సంక్షేమ పథకాలు నిలిపి వేస్తారనే ప్రచారం అవాస్తవమని ఆయన స్పష్టం చేసారు. సంక్షేమ పథకాలను మింగుడుపడని కొందరు కావాలనే ద్రుష్పచారం చేస్తున్నారని, ఓటీఎస్ పై రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి అవంతి శ్రీనివాస్ హితవు పలికారు.