రోశయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ఆర్థికశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్లుగా ఇలా అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించిన రోశయ్య వన్నె తెచ్చారని పేర్కొన్నారు. సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని గుర్తు చేసుకున్నారు సీఎం కేసీఆర్. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. దేశంలో రాజకీయాలకు అతీతంగా అభిమానించే నేతలలో మాజీ సీఎం రోశయ్య ఒకరు అని.. రోశయ్య మృతితో రాజకీయ ధృవతార రాలిపోయింది అని ప్రకటించారు కేసీఆర్. ఐమ్యాక్ కాన్క్లేవ్ అంతర్జాతీయ సదస్సు ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రోశయ్యను సందర్శించలేదని.. మధ్యాహ్నం రోశయ్య నివాసంలో పార్థివ దేహాన్ని సందర్శించనున్నట్టు సమాచారం.