బిగ్ బ్రేకింగ్: ఏపీ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క రాష్ట్రాల మాజీ గ‌వ‌ర్న‌ర్ ఇవాళ ఉద‌యం మృతి చెందారు.  ఆయ‌న గ‌త కాలంగా అనారోగ్యంతో బాద‌ప‌డుతూ ఉన్నారు రోష‌య్య‌. ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా ఇవాళ  ఉద‌యం ప‌ల్స్ ప‌డిపోవ‌డంతో ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ మ‌ధ్య‌లో మ‌ర‌ణించారు. బంజార హిల్స్‌లో స్టార్ ఆసుప‌త్రిలో జాయిన్ చేయ‌డానికి తీసుకెళ్ల‌గా అప్ప‌టికే మృతి చెందిన‌ట్టు వైద్యులు ధృవీక‌రించారు. ప్ర‌స్తుతం ఆయ‌న స్టార్ ఆసుప్ర‌తిలోనే  మృత‌దేహం ఉన్న‌ది. గ‌త కొంత‌కాలం నుంచి అనారోగ్యంతో ఉండ‌డంతో స్టార్ ఆసుప్ర‌తిలోనే చికిత్స తీసుకున్నారు.
తొలి సారిగా రోడ్లు, ర‌హ‌దారులు, ర‌వాణా శాఖ మంత్రిగా మ‌ర్రి చెన్నారెడ్డి ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌ని చేసారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మృతి చెందిన వెంట‌నే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న రోష‌య్య సీఎంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.   అంద‌రితో స‌త్సంబంధాలు క‌లిగినటువంటి నేత‌గా ప‌ని చేసారు. ఏ శాఖ ఇచ్చిన కానీ ఆయ‌న ప‌ని చేసారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. క‌ర్నాట‌క‌కు గ‌వ‌ర్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. స్వాతంత్ర స‌మ‌ర యోధుడుగా రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. సుదీర్ఘ‌కాలం పాటు ఆర్థిక మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. రాష్ట్రం విడిపోయిన త‌రువాత‌.. త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క రాష్ట్రాల‌లో ప‌ని చేసారు. రోష‌య్య‌కు మంచి అనుభ‌వం ఉన్న‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: