రేపు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన
ఆ సమయంలో జగన్ బాధితులను నేరుగా కలిసి పరామర్శించకపోవడం విమర్శలకు తావు ఇచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఇంతలోనే ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కడప జిల్లా రాయచోటిలో వరద సహాయం తీరుపై నిర్వాసితుల నుండి తీవ్రంగా వ్యతిరేకత ఆరంభమైంది. రాయచోటి పర్యటనలో ఉన్న సజ్జలను బాధితులు నిలదీసారు. వరద సాయం అందాకే తాను పర్యటిస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి గురువారం బాధితులను నేరుగా కలుసుకోవడానికి వెళ్తుండటం గమనార్హం.