కేసీఆర్ కు పాకిస్తాన్తో సంబంధాలున్నాయా..? బండి సంజయ్
పాకిస్తాన్ మీద కేసీఆర్కు అంత ప్రేమ పుడుతుంది ఎందుకని ప్రశ్నించారు. నిఘా సంస్థలు ఓ కన్ను వేయాలని పేర్కొన్నారు బండి సంజయ్. ఈ మధ్య పాకిస్తాన్, బంగ్లాదేశ్లపై ప్రేమ కనబరుస్తున్నారు. నీ నిర్వాహకం, నీ కొడుకు నిర్వాహకం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకున్నరు. పాతబస్తీలో 70 శాతం మంది కరెంట్ బిల్లు చెల్లిస్తలేరని స్పష్టం చేసారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ప్రజల దృష్టిని మళ్లించడానికి అని పేర్కొన్నారు బండి సంజయ్. పండించిన ప్రతీ గింజను కొంటానని సీఎం కేసీఆర్ పేర్కొని.. ఇప్పుడూ పూటకొక మాట మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు సంజయ్.