కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!
అయితే ముఖ్యంగా కమిటీలో రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారని స్పష్టం చేసారు. ఈ చర్యతో రైతుల “కనీస మద్ధతు ధర” డిమాండ్ కూడా నెరవేరిందని మంత్రి చెప్పారు. రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడాన్ని నేరరహితంగా పరిగణించాలని రైతు సంఘాలు డిమాండ్ చేయడంతోనే కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన తరువాత రైతులు ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదని, రైతులు తమ ఆందోళనను విరమించి తిరిగి ఇండ్లకు వెళ్లాలని కేంద్రమంత్రి కోరారు. నిరసన సమయంలో నమోదు అయిన కేసుల అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిది అని, ఆ విషయాలపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకుంటాయని.. పరిహారం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహిస్తాయని పేర్కొన్నారు నరేంద్ర సింగ్ తోమర్.