కేంద్ర ప్రభుత్వం మ‌రో కీలక నిర్ణయం..!

N ANJANEYULU
ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విధిత‌మే.  అయితే ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను  క్షమాపణలు కూడా  కోరారు. ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. వ్యవసాయంపై ప్రధాని మోడీ కమిటీ ఏర్పాటు చేసారని మంత్రి వెల్లడించారు. పంట వైవిధ్యం, జీరో-బడ్జెట్ వ్యవసాయం, కనీస మద్దతు ధర లో పారదర్శకత లాంటి అంశాలను కమిటీ చర్చించి నిర్ణయాలను సిఫార్సు చేస్తుందని  తోమ‌ర్ తెలిపారు.  
అయితే ముఖ్యంగా కమిటీలో రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారని స్పష్టం చేసారు. ఈ చర్యతో రైతుల “కనీస మద్ధతు ధర” డిమాండ్ కూడా నెరవేరిందని మంత్రి చెప్పారు.  రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడాన్ని నేరరహితంగా పరిగణించాలని రైతు సంఘాలు డిమాండ్ చేయడంతోనే కేంద్ర ప్రభుత్వం  అంగీకరించిందని వెల్లడించారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన త‌రువాత‌ రైతులు ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదని, రైతులు తమ ఆందోళనను విరమించి తిరిగి ఇండ్ల‌కు వెళ్లాలని  కేంద్ర‌మంత్రి కోరారు. నిరసన సమయంలో న‌మోదు అయిన‌ కేసుల అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిది అని,  ఆ విషయాలపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకుంటాయని.. పరిహారం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహిస్తాయని పేర్కొన్నారు నరేంద్ర సింగ్ తోమర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: